W.G: తాడేపల్లిగూడెంలో జనగణన-2027 కార్యక్రమం క్షేత్రస్థాయి పనులు మున్సిపల్ కమిషనర్ ఎం.యేసుబాబు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఎన్యూమరేటర్లు, జనగణన సిబ్బందితో కలిసి1వ వార్డులో ఇంటింటి సర్వే పనులను పరిశీలించారు. జనగణన దేశ అభివృద్ధికి, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఆధారమని, ప్రజలందరూ ఎన్యూమరేటర్లకు సరైన సమాచారం అందించి సహకరించాలని కోరారు.