AKP: దేశంలో మహిళా విద్య కోసం మహాత్మా జ్యోతిరావు పూలే పునాదులు వేసినట్లు అనకాపల్లి డీఎస్పీ శ్రావణి అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి శ్రావణి పూలమాలవేసి నివాళులర్పించారు. కుల రహిత సమాజం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదిగా పేర్కొన్నారు. పూలే ఆశయాలను సాధించాలని ఆమె పిలుపునిచ్చారు.