ప్రకాశం: పామూరు పట్టణ వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షునిగా యాట వీరస్వామిను వైసీపీ అధిష్టానం నియమించారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దల నారాయణ యాదవ్కు, కృతజ్ఞతలు తెలిపారు. వీరాస్వామి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు.