సత్యసాయి: సోమందేపల్లిలోని వివేకానంద కాలనీ, సప్తగిరి కాలనీ, ఎస్సీ కాలనీల్లో ఆదివారం నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు వడ్డే సూరి, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ పనులు నిర్వహించారు. సప్తగిరి కాలనీలో రెండు, ఎస్సీ కాలనీలో రెండు కరెంట్ పోల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ లైన్మెన్ సూర్యనారాయణ, పరంధామ తదితరులు పాల్గొన్నారు.