VSP: సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో విశాఖనగరం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు జనప్రవాహం మొదలైంది. శనివారం నుంచే పాఠశాలలు కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, ఉద్యోగులు తమ సొంత గూటికి చేరేందుకు పయనమయ్యారు. మధురవాడ మీదుగా శ్రీకాకుళం, విజయనగరం వెళ్లే జాతీయరహదారి ప్రయాణికులతో సందడిగా మారింది.