ATP: నెల్లూరులో జరిగిన 8వ రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అనంతపురం జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 44 పతకాలు సాధించిన విజేతలకు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంస్థ చైర్మన్ గడుపూటి నారాయణస్వామి సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా నుంచి 41 మంది పాల్గొనగా 22 స్వర్ణ, 16 రజత, 10 కాంస్య పతకాలు రావడం విశేషం.