తూ.గో: రాజానగరం మండలంలో 12 ఏళ్ల బాలికపై 44 ఏళ్ల కాళీకృష్ణ అత్యాచారయత్నం చేశాడని ఎస్ఐ మురళికృష్ణ గురువారం తెలిపారు. అనారోగ్యం వల్ల స్కూల్కు వెళ్లని బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడని వెల్లడించారు. కూలి పని నుంచి వచ్చిన తల్లి, స్థానికులు బాలిక అరుపులు విని రావడంతో నిందితుడు పరారయ్యాడన్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.