CTR: తిరుపతి జిల్లా కళ్యాణి డ్యామ్లో ఈతకు వెళ్లి పుంగనూరుకు చెందిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. పుంగనూరు మండలం చిన్న మిట్టపల్లికి చెందిన మురళీమోహన్ మద్యం మానేసేందుకు మూలస్థాన అమ్మవారి ఆలయంలో మొక్కు తీర్చుకోవడానికి వెళ్లాడు. చివరిసారిగా స్నేహితులతో కలిసి మద్యం సేవించిన అతను, అనంతరం డ్యామ్లో ఈతకు దిగి నీట మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.