TPT: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సూళ్లూరుపేట తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుఫాను సమయంలో ఎవరూ బయటకు రావద్దని ఆయన హెచ్చరించారు. ఎదైన ఇబ్బందులు కలిగితె 08623-244122 నంబర్కు కాల్ చేయాలని కోరారు.