W.G: నరసాపురం పట్టణంలోని భారత్, హెచ్.పీ గ్యాస్ గోడౌన్లను RDO దాసి రాజు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహశీల్దార్ ఐ.వి.వి. సత్యనారాయణతో కలిసి స్టాక్ రిజిస్టర్లు, సిలిండర్ల నిల్వలను పరిశీలించారు. గ్యాస్ పంపిణీలో పారదర్శకత పాటించాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమాలకు తావులేకుండా నిబంధనలు పాటించాలని ఆదేశించారు.