ELR: లింగపాలెం మండలంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను సోమవారం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని నిల్వలను పరిశీలించడంతో పాటు, ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను స్కాన్ చేసి వివరాలను సరిచూశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. వినియోగదారులకు ప్రభుత్వం నిర్ణయించిన MRP ధరలకే మద్యం విక్రయించాలని సూచించారు.