VSP: ఎండలు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో విశాఖ కింగ్జార్జ్ ఆస్పత్రిలో తాగునీటి సమస్య ఉధృతమైంది. రోజూ వేలాది మంది రోగులు, సహాయకులు వచ్చే ఈ ఆస్పత్రిలో తాగడానికి నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు విభాగాల్లో వాటర్ ప్లాంట్లు పనిచేయకపోవడంతో బయట దుకాణాల్లో అధిక ధరలకు నీటి బాటిళ్లు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.