GNTR: చంద్రగ్రహణం కారణంగా తెనాలిలోని వైకుంటపురం ఆలయాన్ని మార్చి 3వ తేదీన మూసివేస్తున్నట్లు శనివారం ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు, మహా నివేదన నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు. తిరిగి మార్చి 4వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఉదయం 8 గంటల నుంచి ఆలయం తెరవనున్నారు.