కోనసీమ: ఆత్రేయపురం జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు త్వరలో వార్షిక పరీక్షలు రాయనున్న నేపథ్యంలో క్షత్రియ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం పరీక్ష సామాగ్రి కిట్లను అందజేశారు. ఈ సామాగ్రిని అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తనయుడు సంజీవ్ అందజేశారు.