కృష్ణా: యనమలకుదురు శివాలయంలో జరిగిన ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం సోమవారం ఆలయంలో విచారణ కొనసాగుతోంది. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఆలయ కానుకలను మాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈవో భవానిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. గతంలో పనిచేసిన గంగాధర్ అక్రమాలపైనా విచారణ ప్రారంభమైంది.