BPT: అద్దంకి సమీపంలోని శ్రీనివాస నగర్ వద్ద శనివారం జరిగిన బైక్ ప్రమాదంలో గోవాడ గ్రామానికి చెందిన గెల్లా యేసు రాజు (20) గాయపడ్డాడు. గోవాడ నుంచి అద్దంకి వైపు వెళ్తుండగా, రోడ్డు అంచున బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.