E.G: రాజమండ్రి టూ టౌన్ పరిధిలో శనివారం ఒక మిస్సింగ్ కేసు నమోదైంది. టీ నగర్లోని కోడూరి ప్లాజాలో నివసిస్తున్న గోవింద్ సూతర్ (29) శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన CI శివ గణేశ్ దర్యాప్తు చేస్తున్నారు.