NDL: బనగానపల్లెలో జరిగిన మంగళవారం విలేకరుల సమావేశంలో ఆర్&బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడాన్ని సహించలేకే ఆయన విమర్శలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కాటసాని అవినీతికి ప్రతీక అని మండిపడ్డారు. అభివృద్ధి పనులు దాతల సహకారంతో కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.