BPT: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బాపట్ల పురపాలక సంఘం పరిధిలో శుక్రవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ జి. రఘునాధ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ప్రజలు వినియోగిస్తున్న పబ్లిక్ టాయిలెట్లను శుభ్రపరిచారు. పారిశుధ్య సిబ్బంది టాయిలెట్లను పూర్తిగా శుభ్రం చేశారు.