KRNL: ఆదోని నియోజకవర్గ సమస్యల పరిష్కారం తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పార్థసారథి సోమవారం స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో 15 కీలక అంశాలపై చర్చించి రాయలసీమ గురుకులాలు, బీసీ రిజర్వేషన్లు, దేవాలయ భూములు, మైనారిటీల సమస్యలు, మోటారు వాహన పన్ను వంటి విషయాలను సభ దృష్టికి తెచ్చారు. రాబోయే బడ్జెట్లో ఆదోని అభివృద్ధికి అధిక నిధులు సాధించేందుకు కృషి చేస్తానన్నారు.