KRNL: ఆదోని మండల MEO-2గా మధిరె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగన్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మధిరె పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఫ్యాప్టో నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. రంగన్న మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల హాజరు పెంపు, బోధన నాణ్యత మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు.