SKLM: ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూపై చర్చ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్, మండలి ఛైర్మన్ మోషేను రాజులను క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అనుచితమని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. బుధవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమని, సభ గౌరవాన్ని దెబ్బతీసే చర్య అన్నారు.