PPM: జిల్లాలో సీతానగరం మండలం పెదబోగిల పంచాయతీలో పూర్తిగా ప్లాస్టిక్ వినియోగం నిషేధిస్తూ తీర్మానం చేసినట్లు స్థానిక MPDO ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ సమావేశంలో గ్రామస్టులతో సమావేశమై వారి అభిప్రాయంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి హానికరమని, స్వచ్ఛాంధ్రకు ప్రజలందరూ సహకరించాలన్నారు.