అన్నమయ్య: ఏపీ రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కంచి కామకోటి పీఠాన్ని సందర్శించి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఆశీస్సులు పొందారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఆశీర్వచనం అందుకున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక శక్తి మనిషికి దిశానిర్దేశం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.