ASR: ఇటీవల నిర్మాణం పూర్తైన జాతీయ రహదారి 516ఈ పై అవగాహన లోపంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. డుంబ్రిగూడ మండలం జైపూర్ జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలు అధికంగా ఉండగా, నాలుగు లైన్ల విధానాన్ని పట్టించుకోకుండా ఎదురెదురుగా ప్రయాణించడం ప్రమాదాలకు దారితీస్తోంది. సరైన దిశా సూచికలు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోంది.