E.G: కొంకుదురు బుడతలు మామిడి వద్ద ఉగాది పర్వదినాన ప్రారంభమైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించి పూలంగి సేవ నిర్వహించారు. అర్చకులు రమణ శర్మ, పంతులు మాస్టారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, విశేష అర్చనలు నిర్వహించారు.