ప్రకాశం: అర్హులైన వారికి టిడ్కోగృహాలు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం కనిగిరి ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో సీపీఐ ఆధ్వర్యంలో పేదలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇంటి స్థలాలు, టిడ్కోగృహాలు, పక్కాగృహాల మంజూరు కోసం పేదలు ఎదురు చూస్తున్నారని సీపీఐ జిల్లా నాయకులు సయ్యద్ యాసిన్ అన్నారు. ప్రభుత్వం చొరవ చూపి అర్హులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.