SKLM: నరసన్నపేట పట్టణం వంశధార కాలనీలో శ్రీ ఉమా సహిత నీలకంఠేశ్వర స్వామి దేవాలయ పునః నిర్మాణానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ కృష్ణం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.