CTR: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఇంద్రధనుస్సు పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు RTC డిపో మేనేజర్ దినేష్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బుధవారం CM చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. తర్వాత పుంగనూరు ఆర్టీసీ బస్టాండులో ఉదయం 11 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు.