E.G: రాజమండ్రిలోని 46వ డివిజన్ రామదాసుపేటలో ఉన్న మున్సిపల్ పాఠశాలను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ మేరకు మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు పెట్టె ఆహారం విషయంలో ఎలాంటి లోపం ఉండకూడదని హెచ్చరించారు.