CTR: గంగవరం మండలం వైయస్సార్ జంక్షన్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక వైపు నుంచి కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. కారు బెంగళూరు నుంచి తిరుపతి వైపునకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.