WG: ఆచంట మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. కూటమి నాయకులు, అధికారులు ఇంటింటికీ వెళ్లి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై ఆరా తీశారు. సాగునీటి భద్రత, యంత్రీకరణ, మద్దతు ధర వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సర్వేలో తహసీల్దార్ బి. సోమేశ్వరరావు, ఎంఏవో బి. నాగరాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.