అన్నమయ్య: పీలేరులోని వెంకటాద్రి ఇండ్ల ప్రాంతంలో జయశ్రీ (21) అనే గర్భిణీ మహిళ కట్నం వేధింపులు, భర్త అనుమానంతో తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం ఇంట్లోనే విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.