ATP: ఐపీఎల్ నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లపై నిఘా పెంచినట్లు SP జగదీష్ హెచ్చరించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ రూపాల్లో బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సైబర్ బృందాలు సాంకేతిక పరిజ్ఞానంతో అనుమానాస్పద లావాదేవీలను గుర్తిస్తున్నాయని తెలిపారు. అక్రమాలకు పాల్పడేవారిపై కేసులు నమోదు చేసి, ఖాతాలు ఫ్రీజ్ చేస్తామని పేర్కొన్నారు.