TPT: ఏర్పేడు మండలం పాపానాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 138 మందిలో 133 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగాయన్నారు. ఏర్పేడు సీఐ బి. శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.