E.G: సీఎం చంద్రబాబు శనివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలను సందర్శించి భద్రతా సూచనలు చేశారు. సీఎం రాకపోకల సమయంలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించారు.