KRNL: హొళగుందలో నేడు వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మండల కన్వీనర్ షఫీ ఉల్లా తెలిపారు. ఈ సమావేశానికి ఆలూరు MLA బూసినే విరూపాక్షి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. కొగిలాతోట రోడ్డులోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ZPTCలు, MPP, MPTCలు, సర్పంచులు, నాయకులు పాల్గొనాలన్నారు.