W.G: పాలకోడేరు మండలంలోని కొండేపూడి శివారు వరి పొలాల్లో సోమవారం పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. కొండేపూడి శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో దాడి చేసి 8 మంది జూదరులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.4,200 నగదు స్వాదీనం చేసుకున్నట్లు ఎస్సై రవి వర్మ తెలిపారు.