తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద నిర్మించనున్న 16 కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పాల్లొన్నారు.