కృష్ణా: రంజాన్ మాసం సందర్భంగా గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు సామాజిక సేవకుడు మున్నా భాయ్ 100 మంది పేద ముస్లిం కుటుంబాలకు 11 రకాలతో కూడిన నిత్యవసర సరుకులతో రంజాన్ తోఫాను ఆదివారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్రమైన రంజాన్ మాసం అనేది దానం, సహాయం, మానవతా విలువలను పెంపొందించే పవిత్ర కాలమని తెలిపారు.