ప్రకాశం: తాళ్లూరు మండలంలో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం పాల్పడ్డ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండగా తల్లి శుక్రవారం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. జరిగిన విషయం వెలుగులోకి రావడంతో తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.