కోనసీమ: అమలాపురం రూరల్(మం) సాకుర్రులో నూతనంగా నిర్మించిన రక్షిత మంచినీటి ట్యాంకులను స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు విజన్, DY.CM పవన్ కళ్యాణ్ చొరవతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల వెల్లువ కురుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.