ప్రకాశం: కొనకనమిట్ల మండలం పెద్దారికట్ల సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని మంగళవారం డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మా నాయక్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వసతి గృహంలో కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు మరియు పారిశుద్ధ్యాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ఆయన ఆహార నాణ్యత పై సంతృప్తి వ్యక్తం చేశారు.