PPM: బేబీ కిట్లు మంజూరు కోసం అధికారులకు నివేదికలు సమర్పించామని, త్వరలోనే కిట్లు అందిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా: ఎస్.భాస్కర రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న ఓ పత్రికలో వచ్చిన వార్తకు ఆయన స్పందించారు. మన్యం జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటివరకు బేబీ కిట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.