ఏలూరు: జిల్లా కైకలూరు మండలం కొల్లేటి కోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవాలయం నందు ఈ రోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 91 రోజులకు గాను రూ. 29,65,308 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి కే. శ్రీనివాస్ తెలిపారు. అలాగే అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.