అన్నమయ్య: మదనపల్లెలో ఫుడ్ కమిటీ ఛైర్మెన్ విజయ్ ప్రతాప్ రెడ్డి స్థానిక పుంగనూరు రోడ్డులోని సోషల్ వెల్ఫేర్, ఎస్సీ, బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. శనివారం ఐసీడీఎస్ సీడీపీవో నాగవేణి, రెవెన్యూ అధికారులు, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ అధికారి దామోదర్ రెడ్డి హాజరై ఫుడ్ కమిటీ ఛైర్మెన్తో కలసి వసతి గృహాల్లో చుదువుతున్న బాలికలను పలకరించారు.