KRNL: పత్తికొండలో రేపు ‘అన్నదాత పోరుబాట’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తెలిపారు. ఎరువుల బ్లాక్ మార్కెట్పై నిరసనగా, ఉల్లి, టమాటా రైతులకు గిట్టుబాటు ధర కోరుతూ వైసీపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ సర్కిల్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.