E.G: రాజమండ్రిలోని పలు ప్రాంతాలలో ఉన్న ఇంటి కుళాయిలు, వాటర్ ట్యాంకులను నగరపాలక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఇంజనీర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి నాణ్యత, క్లోరిన్ పరీక్ష నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నగరంలోని ప్రతి వార్డులో ఐదు శాంపిల్స్ చొప్పున క్లోరిన్ పరీక్ష నిర్వహించి నీటి నాణ్యతను పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు.