మార్కాపురం పట్టణంలో రంజాన్ పండగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఈద్గాల వద్ద వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, శాంతి, ఆప్యాయతతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.