ATP: జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ సమక్షంలో పలువురు యువకులు పార్టీలో చేరారు. యువమోర్చా నాయకులు తేజశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దివాకర్ నాయక్, రజక శ్రీకాంత్, చక్రధర్ రెడ్డి, మనిదీప్, సురేంద్ర పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి రాజేష్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని రాజేష్ తెలిపారు.